యూఏఈకి ఇజ్రాయిల్ ‘ఐరన్ డోమ’

అబుదాబి: ఇజ్రాయిల్ తన ప్రధాన రక్షణ వ్యవస్థ ఐరన్ డ్రోమ్ వ్యవస్థను మొదటిసారి విదేశాలకు పంపించింది. ఐరన్ డోమ్ వ్యవస్థతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇతర ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులను యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో అడ్డుకుంది. కానీ కొన్ని ఇరాన్ ఆయుధాలు కీలక…

Read More

నార్పల బస్టాండ్: మాటల్లోనే మిగిలిన అభివృద్ధి……

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి వినిపిస్తున్న ఈ డిమాండ్ ఇప్పటికీ అమలు దశకు చేరకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నూతన బస్టాండ్ నిర్మాణంపై హామీలు ఇచ్చినా, అవి మాటలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పదవిలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, ఈ అంశంలో స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం విమర్శలకు…

Read More

హిజ్రా మల్లిక మృతి పై కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర–తాడిపత్రి..తాడిపత్రి పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది హిజ్రాలు ఆటోలో వచ్చి మల్లికను తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసినప్పటికీ, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అయితే, తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మల్లిక మృతదేహం లభించినట్లు సమాచారం అందిందని చెప్పారు. తాము ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి…

Read More

ప్రజల అర్జీలకు ప్రాధాన్యం – సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి పయ్యావుల కేశవ్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాదర్బార్ నిర్వహించి, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో…

Read More

కేంద్ర విధానాలపై గళమెత్తిన ఎరువుల డీలర్లు , ఉరవకొండలో భారత్ బంద్‌కు స్పందన

నిరసన తెలుపుతున్న డీలర్లు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఎరువులు, పెస్టిసైడ్స్ మరియు విత్తనాల డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నిర్వహించిన దేశవ్యాప్త భారత్ బంద్‌కు ఉరవకొండలో విశేష స్పందన లభించింది. బంద్‌కు మద్దతుగా స్థానిక డీలర్లు స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థలను మూసివేసి ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా డీలర్లు ఐక్యంగా నిలబడి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ…

Read More

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని కలిసిన నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లాకి నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ సోమవారం విచ్చేశారు. అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ని నూతన అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దాదాపు ఏడాది పాటు ఆయన జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా వివిధ శాఖల పనితీరు గురించి శిక్షణ తీసుకుంటారు. నూతన అసిస్టెంట్ కలెక్టర్ వివరాలు.. స్వస్థలం…

Read More

పెన్నహోబిలం రథోత్సవానికి సన్నాహాలు వేగం – రథం ట్రయల్ రన్ విజయవంతం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మే 6న నిర్వహించనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రథం ఫిట్నెస్‌ను పరిశీలించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ట్రాక్టర్ల సహాయంతో రథాన్ని లాగుతూ ట్రయల్ రన్ చేపట్టి, రథం బలం, చక్రాల స్థితి, తాడు వ్యవస్థ వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు. అనంతరం…

Read More

ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్

రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్షక్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశంరాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో…

Read More

బిహార్‌లో ‘విసనకర్రల’ వీధి – Visalaandhra

మాన్‌పూర్( బీహార్): భారతీయ మÖలాలు, సంస్కతీ సాంప్రదాయాలు ప్రత్యేకమైనవి. పర్యావరణ హితంగా ఉంటాయి. వేసుకునే దుస్తులు, వాడుక వస్తువులు, వంట సామాగ్రి, పనిముట్లు అన్నీ పర్యావరణయుతంగా ఉండేవి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు బీహార్‌లోని మాన్‌పూర్ వాసులు. మండు వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అంతటా విస్తృతంగా వాడుతున్నా… దేశంలో చాలా ఇళ్లలో సంప్రదాయ విసనకర్రల వినియోగం ఇంకా తగ్గలేదు. తాటి ఆకులతో తయారుచేసే విసనకర్రలకు బిహార్‌లోని గయా సమీప మాన్‌పూర్ ప్రసిద్ధి. ఇక్కడున్న…

Read More

దిగ్బంధనం తొలగించే వరకు చర్చలుండవ్

స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు సౌద్ దుబాయ్: అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దిగ్బంధనం తొలగించే వరకూ చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇరాన్ శాంతినే కోరుకుంటోందని పెజెష్కియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే దిగ్బంధనం సహా నిర్వహణ పరమైన అడ్డంకులన్నింటినీ అమెరికా తొలగిస్తేనే… మళ్లీ…

Read More