ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్ గురువారం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 59శాతం మంది, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విజయం సాధించిన, మార్కులు మెరుగుపరుచుకున్న విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో ఏడాది విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్ సదుపాయం కల్పించారు.


