పాపం ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి రోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఇస్రాయెల్ పనుపున ఇరాన్ పై నిష్కారణ యుద్ధానికి దిగిన…
ఇరాన్తో ఒప్పందంపై వీడని ప్రతిష్టంభనవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు, హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్లో తన సలహాదారులతో సమావేశమైన ట్రంప్…ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ అణు కార్యక్రమాన్ని…
న్యూదిల్లీ: భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. భూతల, గగన, సముద్రంలో అత్యాధునిక రీతుల్లో పోరాటానికి త్రివిద దళాలు సామర్థ్యం పెంచుకుంటున్నట్టు తెలిపారు. పుణెలో శనివారం జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 150వ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతి తాత్కాలికమేనని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ సెకెండ్ ఫేజ్కు…
ఐపీఎల్`19 తుదిపోరుకు వేళాయేనేడు టైటిల్ పోరులో తలపడనున్న బెంగళూరు, గుజరాత్అహ్మదాబాద్లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభంఅహ్మదాబాద్: టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు మేటి జట్లు అంతిమ సమరానికి సిద్ధమయ్యాయి.లీగ్ దశలో సమాన విజయాలతో టాప్-2లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. తొలిసారిగా గతేడాది ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేర్చుకున్న ఆర్సీబీ, వరుసగా రెండో టైటిల్ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే…ఐపీఎల్లో అడుగు పెట్టిన…
పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు. దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా…
ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారడం వల్ల వరి దిగుబడులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే, కరువు పరిస్థితులను తట్టుకునే వరి రకాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేశారు….
విశాలాంధ్ర _అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానo గ్రామానికి చెందిన బాలుడు రాయుడు శశికాంత్ ఆత్మహత్య కేసులో ఇప్పటికి మొత్తం నలుగురు ముద్దాయిలు అరెస్టు కావడానికి ఎస్పీ తుహిన్ సిన్హా చొరవే కారణమని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకె మారేష్ అన్నారు. శనివారం వుడ్ పేటలో జరిగిన సంఘ సమావేశంలో మారేష్ మాట్లాడుతూ. అత్యంత వెనుకబడిన యాత కులంనకు చెందిన బాలుడు పై కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగిన వారు దాడి చేసి…
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ, రత్నం దంపతులు పిచ్చుక కోటయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంపిసి లో 913/1000 మార్కులు సాధించిన గాదంశెట్టి వర్షిత వీరవేణి కి ఐదువేల రూపాయలను అందజేశారు. మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన వర్షిత తండ్రి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మరణించారనే సంగతి తెలుసుకుని, తన పుట్టినరోజు…
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్కు చెందిన పతంజలి బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) షాక్ ఇచ్చింది. నివారణ అంటూ తప్పుదోవ పట్టించే, అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలతో ఎఫ్డీఏ రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించి భారీగా మందులను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆయుర్వేద, అల్లోపతి మందుల విలువ సుమారు రూ.73.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల్లో పతంజలి బ్రాండ్తో విక్రయిస్తున్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి.డ్రగ్స్…
మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించిన అధికారులు విశాలాంధ్ర – కంబదూరు: కంబదూరు మండల కేంద్రంలోని కోటవీధి మసీదు వెనుక కాలనీలో గత 25 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సూర్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో నీలావతి, పంచాయతీ…
విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో తీరని శోకం విశాలాంధ్ర:ఉరవకొండ ..బక్రీద్ పండుగ ముగింపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని వెళ్లిన ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. విహారయాత్రకు వెళ్లిన తల్లి–కూతురు జలాశయంలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద చోటుచేసుకుంది.అనంతపురం పట్టణంలోని ఆజాద్నగర్కు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు బక్రీద్ పండుగ అనంతరం సరదాగా గడిపేందుకు ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల గ్రామ…