పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం
ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచనరాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్…


