పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం

ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచనరాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్…

Read More

కేసీఆర్ ఒక మర మనిషి.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు

టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవితతెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్ద తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడితెలంగాణ రాజకీయ యవనికపై ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. బీఆర్ఎస్ పార్టీకి కొంత కాలం క్రితం రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. తన తండ్రి కేసీఆర్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జనసముద్రం…

Read More

ఉచిత విద్య, ఉచిత వైద్యం..కవిత పాంచజన్యం హామీలు

రైతును రాజుగా చేస్తామన్న కవితఉపాధి కోసం యువతకు రుణాలుతెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలకమైన ఐదు హామీలను అమలు చేస్తామని తెలిపారు. విద్య: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. విద్యకు…

Read More

నిప్పుల కొలిమిలా రాష్ట్రం…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఎండలుతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే పగటి పూట 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు ఉద్ధృతంగా ఉండటంతో బయటకు రావడానికే భయపడుతున్నారు. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖకు చెందిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ…

Read More

“అక్షయ్ ” కుమార్తెకు సైబర్ వేధింపులు: నిందితుడి అరెస్ట్

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి మీడియాకు వెల్లడించారు. తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమారే స్వయంగా అధికారుల దష్టికి తీసుకువచ్చారని ఏడీజే తెలిపారు. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యపడిందని అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై స్టేట్ పోలీస్…

Read More

అమెరికాతో నేరుగా చర్చలుండవు: ఇరాన్

తేల్చి చెప్పిన విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా శనివారం మలివిడత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, తొలిదశ చర్చల మాదిరిగా ఈసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు జరగబోవని తెహాన్ తాజాగా వెల్లడించింది.‘ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎటువంటి ప్రణాళికలు లేవు. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాగ్చీ…

Read More

కార్మికవర్గం ఊపిరి ఏఐటీయూసీ – Visalaandhra

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నో పోరాటాలు*వర్గ దృక్పథంతో ఉద్యమాలు*రేపటి నుంచి తిరుపతిలో 18వ రాష్ట్ర మహాసభలు (విశాలాంధ్ర-తిరుపతి) చరిత్ర అంటే కేవలం రాజుల విజయగాథలు మాత్రమే కాదు… చెమట చిందించి సమాజ చక్రాన్ని నడిపే శ్రామికుడి పోరాట పటిమ కూడా. ఉమ్మడి చిత్తూరు జిల్లా సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో ఏఐటీయూసీ నిర్వహించిన పాత్ర అద్వితీయం. దశాబ్దాల కాలంగా ఈ జిల్లాలో ఎర్రజెండా నీడన సాగిన కార్మికోద్యమాలు కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా, ఆత్మగౌరవం, సామాజిక…

Read More

డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం నాడు రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణకు హాజరైన ఆయన, కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారని తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో అనంతబాబు…

Read More

నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని రఘునాథపల్లి పోలీసులు అడ్డుకుని పోలీస్…

Read More

ఇండియా కూటమిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం చంద్రబాబు పిలుపు

మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపుఈ నెల 30లోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆందోళనలు చేయాలని ఆదేశంస్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచనడీలిమిటేషన్ సాకుతో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపణఎన్డీఏ మహిళా పక్షపాతి అని.. ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్యపార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి పక్షాలు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు…

Read More