పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి – Visalaandhra

పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో గల ప్రజలు పురపాలక సంఘ బకాయిలను చెల్లించి సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో పలుచోట్ల బకాయిలు గల వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, దీంతోపాటు వారు తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు థియేటర్లు, పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, దీర్ఘకాలిక బకాయిలు ఉన్న ఇళ్ల వద్దకు…

Read More

న్యూయార్క్ మేయర్‌నే నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్‌ను నియమిస్తారా?

: ఇరాన్ మంత్రి చురకఇరాన్‌లో పాలన మార్పుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడంలో తన పాత్ర ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ సహాయమంత్రి సయ్యద్ ఖతిబ్జాదే తీవ్రంగా స్పందించారు. ట్రంప్ తన దేశంలోని న్యూయార్క్ మేయర్‌ను కూడా నియమించలేడని, అలాంటిది ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇటీవల మమ్దానీ ఎన్నికైన విషయాన్ని…

Read More

త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత

భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ, నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వరస్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత…

Read More

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

వయసును బట్టి హేళన చేయడం సరికాదు

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి,…

Read More

కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి

న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ…

Read More

యుద్ధం ఖర్చు వారానికి 3 బిలియన్ డాలర్లు

ఇజ్రాయిల్ ఆర్థిక శాఖజెరూసలేం: అమెరికాతో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికిగాను తమ దేశం వారానికి మూడు బిలియన్ డాలర్ల వ్యయ భారాన్ని భరించాలని ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లప్పర్‌కు ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలన్ రోమ్ లేఖ రాశారు. ఆర్థికపరమైన ఆంక్షలను క్రమంగా సడలించాలని కోరారు. వ్యాపారాలు, పని ప్రదేశాలు ప్రారంభం కావాలన్నారు. భద్రతా పరిస్థితి కోసం రక్షణ విధానం అక్కర్లేనప్పటికీ…

Read More

మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

బీజింగ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు దౌత్య పరిష్కారమే సరైనదిగా చైనా సూచన చేసింది. యుద్ధం ముగించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని పేర్కొంది. సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్‌లో పిలుపునిచ్చారు. యూఏఈ ఉప-ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా గల్ఫ్‌లోని ఉన్న రాజకీయ నాయకులతో ఫోన్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడినట్లు లిన్ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఉందన్నారు. దౌత్యపరంగా…

Read More

నేపాల్‌లో 65 శాతం పోలింగ్ – Visalaandhra

ఎన్నికలు ప్రశాంతంఖాట్మండు: నేపాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటలకు 165 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తుతో ఓటింగ్ మొదలైంది. గతేడాది ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన జెన్‌జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి 1,823,824 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య పది శాతంగా పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. క్యూలైన్లలో ఉన్న చివరి…

Read More

ఇండిగోలో సాంకేతిక లోపం – Visalaandhra

టేకాఫ్ సమయంలో సమస్య గుర్తించిన పైలెట్గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్మంత్రి గొట్టిపాటి, కన్నా, ప్రత్తిపాటి సురక్షితం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసుల్లో ఇటీవల సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం గురువారం అత్యవసరంగా దిగింది. విజయవాడ నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లాల్సిన రెగ్యులర్ విమానంలో బయలుదేరిన తర్వాత కొద్ది సెకన్లలోనే అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్త్తింది. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని…

Read More