ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య…

Read More

మోదీయే మహిళా బిల్లును చంపేశారు

డీలిమిటేషన్ బిల్లును మాత్రమే మేం వ్యతిరేకించాం: ఖడ్గే కూచ్ బిహార్(పశ్చిమబెంగాల్): పునర్విభజన బిల్లునే విపక్షం వ్యతిరేకించిందని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును చంపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆరోపించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని వ్యతిరేకించడం ద్వారా విపక్షం ‘భ్రూణహత్య’కు పాల్పడిందని ప్రధాని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. మహిళా కోటాను తాము వ్యతిరేకించలేదని, విపక్షాల పోరాటమంతా డీలిమిటేషన్ బిల్లుపైనే అని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో…

Read More

అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్

అవకాశాలు రాకపోతేనే ఎక్కువ నేర్చుకుంటాం హైదరాబాద్: అవకాశాలు రాకపోతేనే ఎక్కువగా నేర్చుకుంటామని, అనుభవాలే తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. వైవిధ్యభరితమైన పాత్రలు, కథలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటుంది. గతేడాది ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం ‘భారత్ భాగ్య విధాత’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతోందీ తార. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన సినీ రంగంలో తన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘ముంబైలో…

Read More

యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో…

Read More

కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖవిశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20వేల ఎకరాలు తగ్గించేలా 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు…

Read More

వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు

ఐఎండీ వెల్లడిన్యూదిల్లీ: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతుండగా… రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య వివిధ తేదీల్లో హర్యానా, చండీగఢ్, దిల్లీ, పంజాబ్, తూర్పు రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గంగానది పరివా హక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని…

Read More

ఆర్థిక అసమానతలు తగ్గాలి – Visalaandhra

. అప్ప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు: సీఎం చంద్రబాబు. పుట్టినరోజున అన్నక్యాంటిన్‌లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఫలాలు దక్కినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సంద ర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్‌కు…

Read More

ట్రంప్‌ను పక్కనపెట్టిన అమెరికా సైన్యం! – Visalaandhra

విమాన పైలెట్‌ను రక్షించే ఆపరేషన్‌పై గోప్యతఅధ్యక్షుడికి సమాచారం ఇవ్వని అధికారులు వాషింగ్టన్: ఇరాన్ భూభాగంలో ఇటీవల అమెరికా ఎయిర్‌మన్ రెస్క్యూ ఆపరేషన్ విషయంలో అమెరికా మిలిటరీ అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైతం తెలియ కుండా గోప్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ నకూ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ గతంలో వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకొని వారు ఆయనకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిసింది….

Read More

అమెరికాతో చర్చల్లేవ్

స్పష్టం చేసిన ఇరాన్ తెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రెండో విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని…

Read More

వడివడిగా పోలవరం జలవిద్యుత్

. భారీ టర్బైన్ల వినియోగం. 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 ఉత్పత్తి యూనిట్లు. రోజుకు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దాదాపు 12 టీఎంసీల నీటి వినియోగం. గోదావరి పుష్కరాలకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్న పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రాష్ట్రానికి శాశ్వత విద్యుత్ భద్రతను అందించే…

Read More