తమిళనాడులో రూ.1200 కోట్ల సొమ్ము ‘సీజ్’.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. Source link

Read More

ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి

రుపతికి వేలాదిగా తరలిరండి కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం…

Read More

రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన…

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా… విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు…

Read More

విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…

అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు…

Read More

మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా…

Read More

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా – Visalaandhra

విశాలాంధ్ర-సత్యవేడు:పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి వున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శ్రీసిటీని సందర్శించిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్తోటి ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్,ఇతర విద్యుత్ అధికారులతో కలసి శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ యాజమాన్యంతో పరస్పర చర్చా సమావేశంలో…

Read More

మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థుల ప్రభంజనం: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

​ విశాలాంధ్ర – రాప్తాడు : మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్‌ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లోవందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటిఅద్భుత విజయాలను నమోదు చేశారు. ఎండి కృష్ణభరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో ఏ. సాయిచరిత, ఎన్. లిపి 500 మార్కులకు 486 మార్కులు సాధించి ప్రథమ…

Read More

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల…

Read More

ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్‌టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది….

Read More

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్‌లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.సింగపూర్‌లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత…

Read More