నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు
విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు….


