చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!
నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం…


