పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దు
సభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకం
బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలన్న అధినేత కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఎన్నారై విభాగంలో కూడా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు.పార్టీని మరింత పకడ్బందీగా, పద్ధతిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నారు. పాత కమిటీల స్థానంలో కొత్త రక్తంతో, మరింత ఉత్సాహంగా పనిచేసేలా విభాగాలను పునర్నిర్మిస్తున్నారు. త్వరలోనే విదేశాల్లో ఉన్న పార్టీ మద్దతుదారుల కోసం ఃసమగ్ర సభ్యత్వ నమోదుః కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాతే, కొత్త నిబంధనల ప్రకారం కొత్త కమిటీలను నియమిస్తారు.ఈ పరివర్తన సమయంలో ఎన్నారై సభ్యులు, మద్దతుదారులు సంయమనంతో ఉండి పార్టీ నాయకత్వానికి సహకరించాలని మహేశ్ బిగాల కోరారు.
The post బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు appeared first on Visalaandhra.


