భారత వాతావరణ శాఖ (IMD) తాజా రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి 25 వరకూ కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. రాయలసీమలో 22, 23 తేదీల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది. ఐతే.. తెలంగాణపై సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక తుపాను తరహా ద్రోణి (cyclonic circulation) ఉంది. అలాగే.. మరో వాయు ద్రోణి (air cyclonic circulation).. ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుపై ఉంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.



