అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు

ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీరాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ హైదరాబాద్ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం మీటింగ్‌లు పెట్టడం, ఃజై శ్రీరామ్ః అనడమే పనిగా…

Read More

నేను రాజీనామా చేయను…: మమతా బెనర్జీ

బెంగాల్ ఎన్నికల ఫలితాలను తిరస్కరించిన మమతా బెనర్జీమమతకు ఇండియా కూటమి నేతల మద్దతు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో టీఎంసీ పార్టీ ఓడిపోలేదన్న మమత.. తామే విజయం సాధించామన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయను .. లోక్ భవన్‌కు వెళ్లనంటూ మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మమతా బెనర్జీ ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది….

Read More

విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం

పదో తరగతి టాపర్లకు విమాన ప్రయాణం చేయించిన ఎమ్మెల్యే సౌమ్యకలలకు రెక్కలు పేరుతో వినూత్న కార్యక్రమంప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి వారి కలను నిజం చేశారు.కలలకు రెక్కలు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, నందిగామ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల…

Read More

తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట..పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక డిగ్రీ మేర తగ్గిన ఉష్ణోగ్రతలురెండు మూడు రోజుల్లో మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. సాయంత్రం దాకా ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఎండ తీక్షణంగా కాస్తోంది.కాగా, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ మేర తగ్గాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు…

Read More

ఈసీ సహకారంతో బీజేపీ గెలుపు.. : రాహుల్ గాంధీ

ఇది బీజేపీ అమలు చేస్తున్న పాత వ్యూహమే…ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో నిజంగా గెలవలేదని, ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను తారుమారు చేసుకుని విజయం సాధించిందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇక పశ్చిమ బెంగాల్‌లో 100కుపైగా సీట్ల ఫలితాలు మార్పిడి చేశారని మమతా బెనర్జీ…

Read More

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు…పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అంబ‌టి సెటైరిక‌ల్ ట్వీట్

తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ గెలుపుపై ఏపీలో రాజకీయ చర్చటీడీపీ ప్రభుత్వం పైనా అంబటి జోస్యం.. గట్టిగా బదులిస్తున్న టీడీపీ శ్రేణులువైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన…

Read More

కౌంటింగ్ వేళ…కరెంట్ కట్, సీసీటీవీలు ఆఫ్: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పగ్గాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్రమంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకున్నాయి, సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఆమె సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హుగ్లీలోని సెరంపుర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరమ్ వంటి ప్రాంతాల్లో…

Read More

హోర్మూజ్ జలసంధిపై…‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్లాన్ వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి…

Read More

తమిళనాడులో ‘టీవీకే’ హవా

మొదటి రౌండ్ లెక్కింపు పూర్తిబెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఆదిక్యంలో కొనసాగుతున్నాయిముగ్గురు సీఎంలు వెనుకంజలోనే…ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుకుంటున్నాయి. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన సమయానికి…తమిళనాడులో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ముందంజలో ఉంది. 234 సీట్లకు గానూ… టీవీకే 100 సీట్లపైన ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు గానూ ఒక అసెంబ్లీ స్థానానికి రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ లెక్కింపు జరుగుతోన్న 293 స్థానాలకు గానూ…బీజేపీ 174 స్థానాల్లో…

Read More