లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం..

జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదనదేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు జనాభా ఆధారంగా సీట్లు కేటాయించే విధానానికి భిన్నంగా, రాష్ట్రాల ఆర్థిక పనితీరును ప్రతిబింబించే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆధారంగా ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 30 లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశముందని తెలిపారు. జనాభా నియంత్రణను పాటిస్తూ,ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న…

Read More

తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. వైద్యారోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా, పేదలకు వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఁహెల్త్ ఏటీఎంఁలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ వినూత్న…

Read More

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..!

హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం తన అత్తమామలు, బామ్మర్ది పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేకే తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చైతన్య రెడ్డి (18),…

Read More

మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు

హజ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర ప్రవేశంపై కీలక ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులు, స్థానిక నివాసితులు ఎవరూ మక్కాలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం మక్కాలో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, అక్కడ జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) కలిగిన…

Read More

బెంగాల్‌ను ముక్కలు చేసే కుట్రలు: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్‌లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి…

Read More

ఉపాధి హామీ రక్షణ కై దేశవ్యాప్తంగా ఉద్యమం.. సిపిఐ నేత డి.రాజా

మోడీ సర్కార్ కు సిపిఐ హెచ్చరిక… విశాలాంధ్ర.. ప్రత్యేక ప్రతినిధి/అనంతపురం బ్యూరో.. నూతన ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలకు దిగుతామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా హెచ్చరించారు. కేంద్రం తీసుకొచ్చిన “విబిజీ రాంజీ” చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.అనంతపురం…

Read More

ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం

డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి…

Read More

తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్‌కు తీవ్ర సమస్యలు

చైనాకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్‌ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్‌ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని…

Read More

అర్ధంలేని డిమాండ్ల వల్లే చర్చలు విఫలం

అమెరికాపై మండిపడ్డ ఇరాన్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులు అంగీకరించని కారణంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ… అమెరికా చేసిన అర్థం లేని డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలం చెందాయని ఇరాన్ ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా ప్రస్తావించిందని పేర్కొంది. ప్రజల జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు చర్చలు…

Read More

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ…

Read More