ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్లాగ్ పోస్టులు…


