కర్ణాటక ప్రయోజనాలు కాపాడుకుంటాం – Visalaandhra

మేకెదాటు ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి ప్రియాంక్ ఖడ్గేబెంగళూరు: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖడ్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం నా బాధ్యత. వాళ్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లు (తమిళనాడు) తీర్మానం చేశారు. కోర్టు ఉత్తర్వు చాలా స్పష్టంగా…

Read More

గూగూడు ఉత్సవాలు మూడు రోజులు పూర్తయినా అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు..!

విశాలాంధ్ర -నార్పల :- మండల పరిధిలోని గూగూడు గ్రామంలోని గూగుడు ఉత్సవాలు మూడు రోజులు పూర్తయినప్పటికీ, ఉత్సవాలకు ముందు పూర్తి చేయాల్సిన పలు అభివృద్ధి పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండిపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భక్తుల సౌకర్యాలు, భద్రతకు సంబంధించిన సమస్యలు అలాగే కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో డ్రైనేజ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో…

Read More

ప్రశంసా పత్రాల బహుకరణ… ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల కు చెందిన అధ్యాపకులు శ్రీ బాలాజోషి, శ్రీ కిరణ్ కుమార్ శ్రీ చక్రపాణి రెడ్డి, డా. మల్లికార్జున, కళ్యాణి , అనూష 2026 వ సంవత్సరం నుండి అమలు లో వచ్చే పాలిటెక్నిక్ సిలబస్ సీ-26 తయారీ లో ముఖ్యభూమిక పోషించారు అని తెలిపారు. ఈ సందర్భంగా వారి కృషి కి…

Read More

ముత్యాలమ్మపల్లిలో బర్తాన్ బ్యాంక్ శాఖ ప్రారంభం

బ్యాంక్ శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండల పరిధిలోని ముత్యాలమ్మపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్తాన్ బ్యాంక్ శాఖను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత , టిడిపి రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

Read More

స్పందన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకోండి..

స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు విశేష అనుభవము కలిగిన వైద్య నిపుణుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల మొదటి, మూడవ శుక్రవారం లలో గుండె వైద్య నిపుణులు…

Read More

సర్ ప్రక్రియ పై ప్రతి బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : సర్ పై ప్రతిబిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రారంభమైన సర్ ప్రక్రియ పై ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 2002 సంవత్సర ఓటరు జాబితా ప్రామాణికంగా ఈ సర్ ప్రక్రియ జరుగుతున్నది అని, ఇందులో ఉన్న జాబితా ఆధారంగా ఇప్పుడున్న వారి జాబితా వారికి అనుబంధంగా చేర్చటం జరుగుతుందని, ఒకవేళ ఓటరు…

Read More

రోగులకు వైద్య సేవలో పాస్టర్ ఓపిడి సేవలు

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్రనాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నాలజీతో రోగులకు వైద్య సేవలను మరింత త్వరితగతంగా అందించేందుకు ఫాస్టర్ ఓపిడి సేవలను అమలు పరచడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి స్లిప్పు కావాలి అంటే గంటలకొద్దీ క్యూలో రోగులు నిలబడవాల్సి వచ్చిందని, అలా గాకుండా స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఓపిడి సేవలో స్కానర్ క్యూఆర్ ను తీసుకుంటే ఓపి నెంబర్ వస్తుందని, తద్వారా…

Read More

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా: మరువకొమ్మ కాలనీలో నోటు పుస్తకాల పంపిణీ

​విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : విద్యార్థుల విద్యాాభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, చదువుతోనే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ ఉద్ఘాటించారు. జనసేన వీర మహిళ, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, వాల్మీకి సంఘం అనంతపురం నగర అధ్యక్షురాలు బోయ మంజుల ఆధ్వర్యంలో నగరంలోని 28వ వార్డు మరువకొమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.​ఈ సందర్భంగా టీసీ వరుణ్ తన చేతుల మీదుగా…

Read More

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం – Visalaandhra

కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ…

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

విశాలాంధ్ర-​రాప్తాడు, మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రామినేపల్లి గ్రామ సర్కిల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలానికి చెందిన రంజిత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. కనగానపల్లికి చెందిన రంజిత్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామినేపల్లి సర్కిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు…

Read More