హోర్మూజ్ మూసివేస్తే…ఇరాన్ నాశనమే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికవాషింగ్టన్: అమెరికాఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్మూజ్‌ను మూసివేస్తే..ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామన్నారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు చేశారు. లెబనాన్‌పై ఇరాన్ దాడులను తక్షణమే ఆపాలని, లేకపోతే ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. డీల్ కుదరకపోతే ఆ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా…

Read More

వేడెక్కిన ‘మహారాష్ట్ర’ రాజకీయాలు

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన(యÖబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఓ లేఖను అందజేశారు. ఈ ఫిరాయింపు లాంఛనమే కాగా…సంబంధిత ప్రక్రియ త్వరలోనే…

Read More

ప్రీ వెడ్డింగ్ సరదా విషాదాంతం – Visalaandhra

ఫొటో షూట్ చేస్తూ లోయలో పడిన యువకుడుపూణె: వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాలను ప్రీ వెడ్డింగ్ సరదా విషాదభరితంగా మార్చింది. ఫొటో షూట్ చేస్తూ నవ వరుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాబోయే నవవధువు పుట్టినరోజు కావడంతో వరుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) గురువారం ఉదయం ఆమెను సరదాగా చారిత్రాత్మక లోహగఢ్ కోటకు తీసుకువెళ్లాడు. వారి వెంట వారి సన్నిహిత మిత్రులను తీసుకువెళ్లారు….

Read More

అధికారులను వేధించడానికి ‘ఆర్‌టీఐ’ని వాడొద్దు

ఏపీ సమాచార కమిషన్ వ్యాఖ్యఅమరావతి: పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కీలక వ్యాఖ్యల చేసింది. ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, ప్రభుత్వ అధికారులను వేధించడానికి వినియోగిస్తే సహించబోమని తేల్చి చెప్పింది. ఆర్‌టీఐని దుర్వినియోగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్టీఐ చట్టాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రధాన సమాచార కమిషనర్ సూచించారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన కేసులో…

Read More

హోర్మూజ్‌లో టోల్ వసూల్ చేస్తాం

జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదు: ట్రంప్వాషింగ్టన్: హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60రోజుల్లో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60రోజుల పాటు టోల్-రహిత ప్రయాణం ఉండాలన్నారు. మరోవైపు హోర్మూజ్ ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో లేదని, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని…

Read More

పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు: జేడీ వాన్స్

వాషింగ్టన్: పాకిస్థాన్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అందువల్లే ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేయడంలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ డీల్‌కు ఖతార్‌తో కలిసి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 15న మధ్యంతర శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించగా…రెండు రోజుల తర్వాత ఈ ఒప్పందం అధికారిక పత్రం విడుదలైంది. పాకిస్థాన్, ఖతార్‌లో పత్రికా స్వేచ్ఛ సరిగ్గా లేకపోవడం,…

Read More

ముదిగుబ్బలో ఆ స్థలానికి 22-ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి

250కుటుంబాలకు మేలు చేకూర్చేలా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులువిశాలాంధ్ర ధర్మవరం;;ముదిగుబ్బ మండల కేంద్రంలో 250కుటుంబాలకు గత కొన్నేళ్లుగా ఉన్న సమస్యకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ చొరవతో పరిష్కారం లభించింది. గుంజేపల్లి పొలంలోని సర్వే నెంబర్ 905-ఏలోని 3ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

Read More

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు నీలూరి వెంకట స్వామి విరాళం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు, చేనేత ప్రముఖులు నీలూరి వెంకటస్వామి తన వంతుగా కళాశాలకు 25 వేల రూపాయల నగదును ప్రిన్సిపాల్ వనిత వానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో బాలికల జూనియర్ కళాశాల చదువులోనూ, క్రమశిక్షలను మంచి గుర్తింపు పొందడం వల్ల తాను ఈ సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాల…

Read More

నాటు సారాయి తయారీదారులపై దాడులు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం;; నాటు సారాయి తయారీదారులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో ధర్మవరంలో దాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనంతపురం ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారు, ఈ ఎస్ టి ఎఫ్ బృందం పుట్టపర్తి వారు నాటు సారాయి తయారీ దారులు , అమ్మకం మద్యం దారులపై దాడులు నిర్వహించామని తెలిపారు. బెల్ట్ షాపు ల పై…

Read More

బీఎస్సీ క్వాంటం టెక్నాలజీ కోర్సును సద్వినియోగం చేసుకోండి

– శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్థన్విశాలాంధ్ర ధర్మవరం;;ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక క్వాంటం వ్యాలీ కి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ క్వాంటం టెక్నాలజీ కోర్సును స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతులను మంజూరు చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్థన్ తెలిపారు. ధర్మవరం పట్టణంలో గత…

Read More