కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించిన…


