కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో క‌విత‌ తన కొత్త పార్టీని ప్రకటించిన…

Read More

ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి

ఏపీలో పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%…

Read More

మా వాటా వెంటనే విడుదల చేయండి..తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్

రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకాల వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీకి రావాల్సిన వాటా నిధులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని బేఖాతరు…

Read More

పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై గురువారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులు అధ్యక్షతన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 28న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మే 6న జరిగే బ్రహ్మరథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…

Read More

వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదు….

పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత, ఆయన మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన…

Read More

కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. కేసు వివరాల్లోకి…

Read More

బౌలర్లపై నిందలేయలేం: హార్దిక్ పాండ్య – Visalaandhra

ముంబై: ఐపీఎల్ 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎసఆర్‌హెచ్), ముంబై ఇండియన్స్ బుధవారం తలబడ్డాయి. ఎసఆర్‌హెచ్ ముంగిట భారీ లక్ష్యం నిర్దేశించినా కాపాడుకోవడంలో ముంబయి ఇండియన్స్ విఫలమైంది. 244 పరుగుల టార్గెట్‌ను ఎసఆర్‌హెచ్ మరో 8 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. బుమ్రా, బౌల్ట్, హార్దిక్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ ఎసఆర్‌హెచ్‌ను నిలువరించలేకపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ… ఇక్కడ మంచు ప్రభావం పెద్దగా లేదని, ప్రత్యర్థి బ్యాటర్లు మంచి షాట్లు కొట్టారని వెల్లడించాడు….

Read More

భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు

న్యూదిల్లీ: భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనికి కారణం…జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే. దీనిపై నెట్టింట భారత్ నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్టనివారణ చర్యలకు దిగింది. బుధవారం ఎయిర్‌లైన్స్ తన సోషల్ మీడియాలో ఒక మ్యాప్‌ను పంచుకుంది. అందులో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు పాక్ భూభాగంలో భాగంగా చూపించింది. ఈ పోస్టు తెగ వైరల్ అవగా…భారత నెటిజన్ల నుంచి విమర్శలు వెళ్లువెత్తాయి….

Read More

ఆగష్టు నుంచి రణ్‌వీర్ ‘ప్రళయ్’ ప్రారంభం

సినిమా: ‘ధురంధర్ 2’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న నటుడు రణ్‌వీర్ సింగ్…గతంలో అంగీకరించిన కొన్ని సినిమాల నుంచి ఆయన వైదొలుగుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రళయ్’ టీమ్ స్పందిస్తూ ఆయన ఈ సినిమా నుంచి వైదొలగలేదని స్పష్టం చేసింది. రణ్‌వీర్ హీరోగా జై మెహతా తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్ర బందం వివరణ ఇస్తూ… ‘రణ్‌వీర్, జై ఇద్దరూ…

Read More

నూతన అస్త్రంతో దాడికి దిగుతాం: ఇరాన్

తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో…

Read More