అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి
విశాలాంధ్ర-సచివాలయం: ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ కార్పొరేట్ సంస్థ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కిమ్స్ ప్రతినిధుల మధ్య గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామంలో కేటాయించిన 2 ఎకరాల భూమిలో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని…


