త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ

విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు….

Read More

వీర ప్రకాష్ కు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టరేట్ ప్రదానం

విశాలాంధ్ర – జేఎన్టియు ఏ: బాలాజీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కె.వీర ప్రకాష్ కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ ని ప్రధానం చేశారు. ఎక్స్పరిమెంట్ ది డిజైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్రోచెస్ అండ్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ ఫర్ స్కేల్ అండ్ వెరైటీ యాజ్ కాంట్రాడిక్ట్ టు ఏ సింగిల్ ఇ – లర్నింగ్ సిస్టం అనే…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం – Visalaandhra

భూ వివాదంతో ఇన్నోవాలో బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు కారులోనే రైతుపై దాడి.. రూ.50 లక్షలు డిమాండ్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి వన్‌టౌన్ పోలీసులు ఎన్‌ఎస్ గేట్ వద్ద ఇన్నోవా వాహనం అడ్డగింత ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతును భూ…

Read More

పది పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనసన్మానం

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విజయదుందుభి మోగించి పట్టణ ప్రధమ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 500 మార్కులు పైగా వచ్చిన 71 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం…

Read More

సీనియర్ రక్తదాతలకు సన్మానం

ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సీనియర్ సభ్యులు డాక్టర్ సంకారపు నరసింహులు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, బీసీ రాష్ట్ర సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ దంపతులు ఎక్కువసార్లు రక్తం ఇచ్చిన రక్తదాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెంన్రీ డ్యూనాంట్”జన్మదినం, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్బంగా సీనియర్ రక్తదాతలకు…

Read More

ఉత్కంఠకు తెర.. టీవీకేకు వీసీకే మద్దతు

తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటుచేస్తారనే ఉత్కంఠకు తెరపడినట్లే కనిపిస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)  ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఎట్టకేలకు చేరుకుంది. కీలక పరిణామంలో, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ టీవీకేకు తన మద్దతును ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమావళవన్ తన పార్టీ మద్దతును విజయ్‌కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు…

Read More

ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో, మమతా బెనర్జీ తన ఎక్స్ (ట్విట్టర్) బయోను అప్‌డేట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత ..ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ ఆరోపిస్తూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.ఆ తర్వాత మే 7వ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి దానిని రద్దు చేస్తూ ఓ ప్రకటన విడుదల…

Read More

పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏవి నాగేశ్వరావు విశాలాంధ్ర – కడియం : కడియం పేపర్ మిల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అక్రమ లాక్ అవుట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తి వేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కడియం పేపర్ మిల్లు వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్టు కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు,…

Read More

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. కొన్ని ఇళ్లలో ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో భయపడిన…

Read More

బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి… ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే…

Read More