దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా…

Read More

ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధం

శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు తాను పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ చర్చల కోసం వారు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఒకవేళ ఇస్లామాబాద్‌లో ఒప్పందం ఖరారైతే నేను తప్పకుండా…

Read More

చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో…

Read More

ఘనంగా ఐఎన్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం – Visalaandhra

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య హైదరాబాద్: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముంబయి వేదికైంది. బాలివుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ వర్గాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. నిర్వహించిన ఈ ఈవెంట్‌లో చాలామంది సినీ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ యాక్టర్ రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా అదరగొట్టారు. ఈ…

Read More

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు

గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ…

Read More

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు…

Read More

కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర…

Read More

పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భక్తుల సౌకర్యం, విశ్వాస పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇకపై దేవస్థానం ఆవరణంలోనే శుచిశుభ్రతతో, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన ప్రతిష్టను మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి…

Read More

ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు..

ప్రిన్సిపాల్ వనిత వాణివిశాలాంధ్ర ధర్మవరం; ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరపు లో 141 మంది పరీక్షలు రాయగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 83 శాతంనమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనరీ విభాగంలో 85 మంది కు గాను 71 మంది ఉత్తీర్ణులు కాగా 84 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా ఎస్. భవాని…

Read More

యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు..

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషువిశాలాంధ్ర ధర్మవరం;;జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి…

Read More