ఏపీలో విభిన్నమైన వాతావరణం
ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండలు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు…


