ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం – ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరం క్యాంపులను సజావుగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్, డాక్టర్ ముక్తియార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా 24 మంది సదరం క్యాంపులకు రావడం జరిగిందని, వారికి అన్ని విధాల వైద్య చికిత్సలను అందించి, శరీర భాగంలో ఏ అవయం ఎంత శాతం లేదో చికిత్సలు అందించామన్నారు. తదుపరి నివేదికలను తయారుచేసి జిల్లా అధికారులకు పంపడం జరిగిందన్నారు. సర్టిఫికెట్లు మూడు నెలల లోపు సచివాలయాలలో పంపిణీ చేస్తారని, తొలుత సంబంధిత రోగికి మెసేజ్ వెళుతుందని తెలిపారు.
The post సజావుగా సదరం క్యాంపులు appeared first on Visalaandhra.


