లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి నోటీసులు27న విచారణకు హాజరు కావాలని ఆదేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏసీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచడంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి చెందిన ఇశ్వానీ, కేశినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రైడ్ ఇన్‌ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. తొలుత ఎంపీ కేశినేని చిన్ని…

Read More

హోర్మూజ్ దిగ్బంధం కొనసాగుతుంది: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌తో ఒప్పందం కోసం తామేమీ తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అమెరికా అధికారులు చర్చల కోసం తగినంత సమయం తీసుకోవాలని సూచించారు. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేవరకు కొనసాగుతోందని వెల్లడించారు. వాస్తవానికి ఇరాన్-అమెరికా ఒప్పందం దిశగా ముందడుగు వేసినట్లు వార్తలు వస్తున్నా… అవి కుదిరేసరికి ఎన్నాళ్ల సమయం పడుతుందో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే…

Read More

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి – Visalaandhra

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ముఖ్యంగా రాజధాని కీవ్ రీజియన్‌పై క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో శక్తిమంతమైన హైపర్ సోనిక్ ‘ఒరెష్నిక’ క్షిపణులను రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. బిలా సెర్క్వా నగరంపై ఆదివారం ఉదయం రష్యా జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందగా, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి కారణంగా నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా…

Read More

అజ్ఞాతంలోనే మొజ్తాబా – Visalaandhra

శాంతి ఒప్పందం మరింత జాప్యంతెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నా… అవి ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీనికి కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖామేనీ అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. మొజ్తాబా రహస్య ప్రాంతంలో ఉన్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం దూతల సాయంతోనే అధికారులు, నాయకులకు ఖామేనీ సందేశాలు పంపిస్తున్నాడని పేర్కొన్నాయి. ‘అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను మొజ్తాబా ఖామేనీ చూసినట్లు మాకు సమాచారం అందింది. అయితే, దానిపై ఆయన…

Read More

రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల రూపకల్పన

. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ-కర్నాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై కీలక భేటి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉత్తమ్ కుమార్ తో కర్నాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజులు భేటి అయ్యారు. తెలంగాణ -కర్నాటక రాష్ట్రాల మధ్య…

Read More

కనీస వేతనాల పెంపుపున:పరిశీలించండి – Visalaandhra

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ…

Read More

ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో

. రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్. ఐఆరఎఫ్‌సీతో రుణ ఒప్పందం. భవిష్యత్ విస్తరణకు బలమైన ఆర్థిక పునాది. ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎస్ విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. దిల్లీలో సోమవారం ఈ ఒప్పందంపై ఐఆరఎఫ్‌సీ,…

Read More

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం – Visalaandhra

. ఆడపడుచుల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లింపు. మహిళా సంఘాలతో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు. బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.10 లక్షలకు పెంపు. కార్పొరేట్ తరహా మహిళా సూపర్ బజార్లు. స్త్రీ శక్తి భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా మహిళలు అభివృద్ధి సాధించినప్ప్పుడు…

Read More

సీఆర్‌డీఏ ఇంచార్జి కమిషనర్‌గా భార్గవ్ తేజ

విశాలాంధ్ర – సచివాలయం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ వి.విజయ్ రామరాజు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఇంచార్జి కమిషనర్‌గా ఎ. భార్గవ్ తేజ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌గా విధుల్లో ఉన్న ఆయనకు కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ సోమవారం జీవో 660 జారీ చేశారు. విజయ్…

Read More

ఘనంగా ఫిట్ ఇండియా ఉద్యమం..

రైల్వే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ కార్యాలయంలో ఫిట్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా కామన్ హెల్త్ క్రీడల ఇతివృత్తంలో చేయబడిన సండే సైకిల్ ప్రచార కార్యక్రమం యొక్క 75 వ విడతలో భాగంగా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ ఎస్ఐపిఎఫ్ కోటీశ్వరరావు, ఏ ఎస్ ఐ పి ఎఫ్, ధర్మవరం ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి పట్టణ పరిధిలో సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు….

Read More