యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది….

Read More

నేపాల్‌లో చారిత్రక గెలుపు దిశగా ఆరఎస్‌పీ

ఖాట్మండు: నేపాల్‌లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్‌పీ) చరిత్ర సష్టించబోతోంది. చారిత్రక గెలుపు దిశగా దూసుకెళుతోంది. 94 నియోజక వర్గాల్లో ఆరఎస్‌పీ ఆధిక్యత సాధించింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్యూఎంఎల్‌ను వెనకు నెట్టి సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భించబోతోంది. మధ్యాహ్నం వరకు నేపాలీ కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఏడు చోట్ల సీపీఎన్ యూఎంఎల్ ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల వరకు ఖాట్మండు మేయర్‌గా ఉన్న బాలేంద్ర షా ఝాపా5 నియోజకవర్గంలో ముందంజలో…

Read More

భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే

వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి…

Read More

అమెరికా పేల్చిన ఇరాన్ నౌకలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు

ప్రధాని అల్బనీస్మెల్‌బోర్న్: హిందూ మహా సముద్రంలో అమెరికా జలాంతర్గామి… ఇరాన్ నౌకను టార్పిడోతో పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 87 మంది నావికులు మృతిచెందగా, సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. అయితే జలాంతర్గామిలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. కానీ తమ రక్షణ దళ సిబ్బంది ఆ దాడిలో పాల్గొనలేదని ఆయన అన్నారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గామి తన టార్పిడోతో…

Read More

మా తదుపరి లక్ష్యం క్యూబా: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి భీకర దాడులు కొనసాగిస్తున్న అమెరికా తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ప్రకటించుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా భద్రతకు క్యూబా పెద్ద ముప్ప్పు అని ఆయనన్నారు. క్యూబా విదేశాంగ విధానం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. అమెరికాకు పక్కలో బల్లంలా క్యూబా తయారైందని, తమ పక్కనే ఉంటూ శత్రు దేశాలకు సహకరిస్తోందని ఆరోపించారు. ఇరాన్ తర్వాత లక్ష్యం కL్యబా అని ట్రంప్ స్పష్టంచేశారు. ‘ముందు ఇరాన్…

Read More

‘భోగి’ నుండి శర్వా స్పెషల్ పోస్టర్

హైదరాబాద్: ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’తో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్… ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోగా శర్వానంద్, హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయమనిపిస్తోంది….

Read More

విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్‌స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి,…

Read More

22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి. కోర్ట్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. రెవిన్యూ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష విశాలాంధ్ర – ఏలూరు : జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం 22ఏ భూ సమస్యల పరిష్కారం,…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More