ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు. రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 45.9 డిగ్రీలు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. మొత్తం 20 జిల్లాల్లోని 252 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకుపైగా నమోదైనట్లు వెల్లడించారు.శనివారం వడగాలుల ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని…


