యురేనియం నిల్వలు…వైరిపక్షాల బేరసారాలు – Visalaandhra

ఎనిమిది దశాబ్దాల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా లిటిల్ మాన్, ఫాట్ బాయ్ అనే పేర్లతో ప్రయోగించిన అణుబాంబులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. క్షణాల వ్యవధిలో లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా, ఆ రెండు పట్టణాలు కనుమరుగై పోయాయి. ఆ రోజు మొదలైన అణ్వస్త్ర భయం నేటికీ ప్రపంచ రాజకీయాలను శాసిస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ, అంతర్జాతీయ రక్షణ రంగంలో ప్రస్తుతం అణ్వాయుధాలు ఒక దేశ సార్వభౌమాధికతకు గీటురాయిగా, మనుగడకు ఆలంబనగా మారిపోయాయి. ఒక దేశం…

Read More

ఎడారిని పంట భూమిగా మార్చిన చైనా

టి. లక్ష్మీనారాయణ ఇటీవల నేను చదివిన అనంతపురం అర్ధ-శుష్క ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తల పరిశోధన పత్రం నాకు తీవ్ర ఆందోళన కలిగించింది. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో నేల క్షీణత, ఇసుక ఆక్రమణ, హగరి (వేదవతి) నది ఎండిపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయానికి ముప్పుగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎడారులను సైతం వ్యవసాయ భూములుగా మార్చిన చైనా అనుభవం మన ఆలోచనలకు పదునుపెట్టాలి. 1990 ఏప్రిల్ 3-9…

Read More

మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?

. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య మంతనాలు. 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన. ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు న్యూదిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు…

Read More

అప్పుల బాధ.. మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

విశాలాంధ్ర – యాడికి: అనంతపురం జిల్లా యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మద్యానికి బానిస కావడంతో ఓ వ్యక్తి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగుచూసింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి కృష్ణయ్య (38) తన భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రైతుల వద్ద కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని…

Read More

ఘనంగా భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :భారత మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గురువారం ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రావణి రెడ్డి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ జరిగింది. ముందుగా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ ఎస్ గిడ్డమ్మ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 1954లో భారత జాతీయ మహిళా సమాఖ్య కలకత్తా లో ఏర్పాటు చేయయడం జరిగిందన్నారు. మహిళా సమాఖ్య ఏర్పాటులో…

Read More

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంలో చుక్కెదురు

న్యూదిల్లీ: తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ’ పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వర్సిటీతో తమకు సంబంధం లేదని బోర్డులు పెట్టాలని తెలంగాణ కాలేజీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 12వ తేదీ లోగా ప్రముఖ దినపత్రికల్లో పావు పేజీ ప్రకటనలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. The post ప్రిన్స్‌టన్…

Read More

రుద్ర ఎం-11 ప్రయోగం విజయవంతం – Visalaandhra

న్యూదిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గగనతలం నుండి భూతల క్షిపణి రుద్ర ఎం-11 ప్రయోగం విజయ వంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సంయు క్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించా యి. భారత్ తన కచ్చితమైన దాడుల సామర్థ్యాల ను బలోపేతం చేయడా నికి, రక్షణ సాంకేతికతలో స్వావలం బనను పెంపొందించుకో వడానికి చేపడుతున్న చర్యల్లో ఈ ప్రయోగం మైలురాయిగా నిలిచింది. అన్ని కీలక ఉపవ్యవస్థలు, ప్రయోగ పరిమితుల పనితీరును…

Read More

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు రాజ్యాంగ రక్షణ ఉండదు

న్యూదిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబో దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ క్రీడలపై ఆన్‌లైన్ బెట్టింగ్ లను నిషేధిస్తూ తమిళనాడు, కర్నాట క చేసిన చట్టాల రాజ్యాంగబద్ధతను సమర్థించింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం…

Read More

మళ్లీ దద్దరిల్లిన గల్ఫ్

. అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్. కువైట్, బెహ్రెయిన్‌పై దాడులు. ఇది ఆత్మరక్షణే: ఐఆర్‌జీసీ తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ బాంబుల మోత మోగింది. డ్రోన్‌లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా- ఇరాన్ మధ్య భీకర పోరుసాగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్‌లోని అల్ సలేం`బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ చట్టం, కాల్పుల విరమణను అతిక్రమించి, ఖేష్మ్ ద్వీపంలోని కమÖ్యనికేషన్స్ టవర్‌పై, హోర్మూజ్ జల…

Read More

నేపాల్‌లో నిరసనల హోరు

ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలుసార్వభౌమత్వం కాపాడుదామని నినాదంనష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా గొంతు…

Read More