లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట ఆర్టీసీ డిపోకు…


