సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు ఁసుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ఁకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని, పెండింగ్…

Read More

ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేసిన ట్రంప్

ఇరాన్‌తో చర్చల్లో పురోగతి సాధించామని, పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై విధించిన దిగ్బంధనం మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించాం. పాకిస్థాన్,…

Read More

అయ్యో…మామిడి రైతు – Visalaandhra

. నాలుగు టన్నుల ధర రూ.1,000. చిత్తూరు జిల్లాలో దారుణ పరిస్థిత విశాలాంధ్ర-చిత్తూరు : రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్లముందే రాలిపోతుంటే… కన్నీటిపర్యం తమవుతున్న ఆ రైతును ఆదుకోవా ల్సిన వ్యవస్థే వంచించింది. చిత్తూ రు జిల్లా మామిడి రైతు పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది. అకాల వర్షం ఒకవైపు దెబ్బకొడితే, మార్కెట్‌లో వ్యాపారులు కనికరం లేని ధోరణితో రైతు కడుపు కొడుతున్నారు. సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వీచిన భారీ గాలులకు…

Read More

శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ – Visalaandhra

. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నరుకు లేఖ. రేపు సీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధం. రిసార్టుకు విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులతో టీవీకే కార్యాలయంలో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత విజయ్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు….

Read More

రైల్వే జోన్కల సాకారం – Visalaandhra

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుగెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంజాన్ 1 నుండి కార్యకలాపాలు ప్రారంభంమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక సాకారమైంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు దశాబ్ద్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులతో ఏర్పాటు చేసిన రైల్వే జోన్ సాధన సమితి పోరాట ఫలితంగా…

Read More

రాజీనామా ప్రసక్తే లేదు

టీఎంసీ ఓడిపోలేదు… ఇది ప్రజా తీర్పు కాదు . బీజేపీ విజయం కుట్రపూరితం. ఈసీతో కుమ్మక్కై 100 స్థానాలు దోచుకుంది. ఈ ఎన్నికలకు సీఈసీ ప్రధాన విలన్. మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు. ‘ఇండియా’కు మద్దతు ప్రకటన కోల్‌కతా: తృణమÖల్ కాంగ్రెస్ ఓడిపోలేదని, కాషాయ పార్టీకి మద్దతిచ్చిన ఎన్నికల సంఘంతో తలపడిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఈసీ ఓ విలన్‌గా మారారని…

Read More

మొక్కజొన్నకు రూ.2400 ఇవ్వాల్సిందే

. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ధర్నాలు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి: కేవీవీ ప్రసాద్. కేంద్రంపై సీఎం ఒత్తిడి పెంచాలి: జమలయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:మొక్కజొన్నకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,400 చెల్లించాలని, ఇప్పటికే మార్కెట్‌లో అమ్ముకుని నష్టపోయిన రైతాంగాన్ని ధరల వ్యత్యాస పథకం ద్వారా ఆదుకోవాలని, ధరల స్థిరీకరణ…

Read More

హైకోర్టుకు మరో ముగ్గురు జడ్జిలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి మరో ముగ్గురు జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అన్ని రాష్ట్రాలకు న్యాయమÖర్తులను సిఫారసు చేసే ప్రక్రియలో భాగంగా సమావేశమైన కొలీజియం… ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయాధికారులుగా పనిచేస్తున్న ముగ్గురు అధికారులను న్యాయమÖర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయమÖర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సీహెచ్ పురుషోత్తమ కుమార్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి….

Read More

గనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు – Visalaandhra

. రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు… 1.52 లక్షల మందికి ఉపాధి. ఇనుప ఖన్పుిం సద్వినియోగానికి కార్యాచరణ. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల…

Read More