మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటాలు ఆగవు..

సత్య సాయి ఎర్రగుంట పంపు హౌస్ కార్మికులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట పంపు హౌస్ వద్ద గల సత్యసాయి కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయేంతవరకు తమ పోరాటాలు ఆపమని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి యొక్క నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. కార్మికులందరూ నోటికి రిబ్బన్ కట్టుకొని తమ మౌన పోరాట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు రాక కార్మికులు చాలా…

Read More

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చేస్తాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు. కార్యదర్శి సుభాష్ చంద్రబోస్. విశాలాంధ్ర ధర్మవరం:: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సేవలను మరింత అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణములోని ఐఎంఏ పనితీరును, వారు చేస్తున్న సేవలను అధికార పూర్వకంగా సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఐఎంఏ చేస్తున్న సేవలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్బిఐ…

Read More

రక్త పోటు నియంత్రణపై అవగాహన – Visalaandhra

రిటైర్డ్ కంటి జిల్లా అంతత్వ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: రక్తపోటు నియంత్రణపై అవగాహన అందరికీ ఉండాలని రిటైర్డ్ కంటి జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తపోటు నియంత్రణపై అవగాహన మాసోస్తవం పురస్కరించుకొని పలు విషయాలు తెలియజేశారు. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసేది అధిక రక్త పోటూ అని తెలియజేశారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా మనిషి జీవితాన్ని దెబ్బ తీస్తుందని . ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం…

Read More

వేసవి శిక్షణ తరగతులు విద్యార్థులకు ఒక వరం

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు ఒక వరం అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు నీతి కథలు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడం జరిగిందని తెలిపారు. నీతి కథలు ముకుంద టీచర్ ద్వారా చెప్పించడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి…

Read More

ముగిసిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం

ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి నాగార్జున రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;! ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే బి నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మే నెల 16, 17 రెండు రోజులపాటు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

Read More

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి నా ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందిమున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు హేమంత్ బాబువిశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధియే నా ధ్యేయమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందని మున్సిపల్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ నిమ్మల హేమంత్ బాబు తెలిపారు. ప్రస్తుతం హేమంత్ బాబు తన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రయత్నం చేయడానికి ఒంటరి పోరాటాన్ని సల్ఫీ విజయపతంలో ముందంజలో ఉన్నారు. వివరాలకు వెళితే నిమ్మల హేమంత్ బాబు తల్లిదండ్రులువెంకటరమణ ,గంగులమ్మ….

Read More

ఘనంగా అన్నమయ్య సంకీర్తన విభావరి.. కళాజ్యోతి కార్యవర్గం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో (ఈ సి ఆర్ ఆర్ సరస్వతి నిలయం) కళాజ్యోతి కార్యవర్గం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన విభావరి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని కళాజ్యోతి కార్యవర్గం అధ్యక్షులు కే నారాయణ, కార్యదర్శి బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఈ సంకీర్తన విభావరి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తన గానము…

Read More

ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు, సన్మాన కార్యక్రమం..

యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎర్రగుంట వద్దగల యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ వారు ఇటీవల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, జనరల్ సెక్రెటరీ కప్పల బలరాముడు, కోశాధికారి బండి ఉజ్జినప్ప మాట్లాడుతూ 2026…

Read More

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల – Visalaandhra

ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్…

Read More

‘ఉగ్రవాద నిరోధక చట్టం కేసులోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ అనేది ఒక రూల్్ణ అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు గతంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన సొంత ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్…

Read More