తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ‌‌..

ఎంపీడీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన…. సిపిఐ ముదిగుబ్బ మండలం కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ పాత ఊరిలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుకు చెందిన గ్రామస్తులు గత్యంతరం లేకమంగళవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు చేత పెట్టి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించిఆ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తూ అధికారులు,…

Read More

జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్

దేశంలో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక్ణ విధానాన్ని అమలు చేస్తే సుమారు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చైర్‌పర్సన్, లోక్‌సభ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు. దీనివల్ల దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. మంగళవారం గాంధీనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో నిరంతరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో…

Read More

ఏఐఏడీఎంకే చేరిక ఊహాగానమే..: అధవ్‌ అర్జున

కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడితమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ ముందే రాజకీయ సెగలు రేగాయి. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకుంటే మద్దతు ఉపసంహరిస్తామన్న సీపీఎం హెచ్చరికలపై క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున బుధవారం స్పందించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. సీపీఎం చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము ఆ పార్టీ నేతలతో మాట్లాడామని అర్జున వెల్లడించారు. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం కేబినెట్‌లో చేరుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు….

Read More

మత్స్యకార, అన్నదాతల సంక్షేమమే మాకు అత్యంత ముఖ్యం : పవన్ కల్యాణ్

ప్రతి మత్స్యకార కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 20 వేలు జమ చేస్తున్నామన్న డిప్యూటీ సీఎంఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు, వారికి స్థానికంగానే మెరుగైన ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాల…

Read More

కల్కి 2 కోసం ఎకానమీ క్లాస్‌లో కమల్ ట్రావెల్

కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై కూడా పడుతోందని ఇటీవల పేర్కొన్న కమల్ హాసన్, ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని సినీ రంగానికి సూచించారు. అయితే ఆయన చెప్పిన మాటలను కేవలం సూచనలకే పరిమితం చేయకుండా స్వయంగా ఆచరణలో పెట్టి చూపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాను పాటించాలని సూచించిన పొదుపు విధానాలకు కట్టుబడి,’కల్కి 2898 AD పార్ట్ 2’తాజా షూటింగ్…

Read More

ఏపీలో మత్స్యకార భరోసా నిధుల విడుదల..

కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ… నిధులు విడుదల చేసినందుకు సీఎంకు మత్స్యకారుల కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార భరోసాః సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 పడవల్లో కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు.పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ, మానవ…

Read More

దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుంది..

మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను…

Read More

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 21 నుంచి ప్రారంభం

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు – మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు ప్రిన్సిపల్ కృష్ణమూర్తి విశాలాంధ్ర – ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఎం. కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి…

Read More

లత్తవరం గ్రామంలో నూతన బోరు బావి ప్రారంభం

విశాలాంధ్ర – ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశాలతో ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి సమీపంలో నూతన బోరు బావిని ఏర్పాటు చేసినట్లు మంగళవారం గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ…

Read More

ఆంజనేయ స్వామి మాన్యం భూమి ఆక్రమణ (ఆన్‌లైన్) నమోదుపై చింతలపల్లి గ్రామస్థుల ఆగ్రహం

విశాలాంధ్ర ధర్మవరం;మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఉన్న స్వామి మాన్యం (దేవుడి) భూమి కొంతమంది వ్యక్తుల పేరిట ఆన్‌లైన్ కావడంపై స్థానిక గ్రామస్థులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో చింతలపల్లి మహేష్ చౌదరి ,గ్రామస్థుల తో పాటు ఆర్డీఓ, ఎంఆర్‌ఓలను కలిసి ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం… చింతలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 253 లో…

Read More