ఉరవకొండలో హిందూ స్మశాన వాటిక దుస్థితి- స్థలం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండ పట్టణంలో వెలిగొండ రహదారిలో ఉన్న హిందూ స్మశాన వాటిక సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్మశాన వాటిక విస్తీర్ణం లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు బాధలో ఉండగానే సమాధి కోసం స్థలం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు చెబుతున్నారు….

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు….

Read More

వేసవి శిక్షణ క్రీడారంగం జూడో .. జూడో కోచ్ ఇనాయత్ భాష

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని జీవి ఈ జెడ్పిజిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కళాజ్యోతి సర్కిల్ లో గల బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరం లో జూడో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది అని జూడో కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ .స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేసవి శిక్షణ శిబిరం ఈనెల మే 01 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ…

Read More

అంజన్ రెడ్డి పై మంత్రి అనుచరుల దాడిపై తీవ్ర నిరసన

కర్నూలు రౌడీలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మంత్రి సత్య కుమార్ యాదవ్ పిఏ హరీష్ బాబు తో పాటు ఆరు మంది హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి చేసిన ఘటన దారుణమని మంత్రి అనుచరులను, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంజన్ రెడ్డి సోదరుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ…

Read More

బాలిక విషయంలో రాజకీయం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే…

Read More

కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం..

రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.ప్రముఖ హరిత విద్యుత్ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో తన అనుబంధ సంస్థల ద్వారా రూ.2,400కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులను శుక్రవారం కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల…

Read More

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎబోలాపై అలర్ట్.. ఆ మూడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కీలక సూచనలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ఇవాళ‌ ఒక హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే విమానాశ్రయంలోని ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్…

Read More

ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుండగా, ఈ సమయంలో కేంద్ర మంత్రులందరూ జాతీయ రాజధానిలోనే ఉండాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర…

Read More

మెగాస్టార్ మూవీకి పవర్‌స్టార్ క్లాప్

హైదరాబాద్: అగ్రహీరో మెగాస్టార్ కొత్త సినిమా షురూ అయింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం(నేడు) సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఫుల్ జోష్‌తో కొత్త సినిమా ఆరంభమైంది. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రానున్న సినిమా ‘మెగా 158’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. పవన్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా… చిరు…

Read More

కల్వర్టుకు మరమ్మత్తులు చేయించండి.. ప్రజల ఆవేదన

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సొంత మార్కెట్లో వెళ్లే రహదారిలో కాలువపై కలువట్లు శీతలం కావడంతో వాహనదారులు బాటసారిలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దిమ్మిలు మధ్యలోకి విరిగిపోవడంతో కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. సంతకు వచ్చే ఎంతోమంది ప్రజలు కొనుగోలు చేయాలంటే దీనిపై వెళ్లక తప్పడం లేదు. ఇక వాహనాలు అయితే ఎక్కడికక్కడ కాలువలోకి పడుతాయేమో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి విరిగిన సిమెంటు దిమ్మెలను తొలగించి నూతనవి…

Read More