News Desk

60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు

అవసరమైతే యూఏఈ నుంచి నేరుగా ఎల్పీజీ కార్గోలు: హర్దీప్ సింగ్ పురీన్యూదిల్లీ: హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని, 30 నుంచి 60 రోజుల వరకూ సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదన్నారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర…

Read More

సహజ సంపదకు ఎసరు! – Visalaandhra

. కొండలను పిండి చేస్తున్న మాఫియా. యదేచ్ఛగా నల్లరాయి, గ్రానైట్, తెల్లరాయి తవ్వకాలు. అడవుల విధ్వంసం, పర్యావరణానికి విఘాతం. బినామీల పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు. కళ్లప్పగించి చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లాలో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కొండలను పిండి చేస్తూ, అడవులను విధ్వంసం చేస్తూ, పర్యావరణానికి విఘాతం కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మైదాన ప్రాంత బడా వ్యాపారులు. ఐదవ…

Read More

రేపు ఎన్డీఏ భేటీకి చంద్రబాబు, పవన్

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వారు పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో మÖడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ…

Read More

వచ్చే ఏడాదికల్లా భూ రికార్డుల ప్రక్షాళన

. కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా చర్యలు. రెవెన్యూ శాఖలో సమÖల మార్పులు చేపట్టాం. సంక్షేమంఅభివృద్ధి సుపరిపాýనే లక్ష్యం. ‘మీ భూమి- మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర – పెనుమంట్ర: రాష్ట్రంలో 2027 నాటికి భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సోమవారం జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం…

Read More

ఖరీఫ్ ముంగిట అన్నదాతకు సంకటం

. 25 లక్షల భూసార కార్డుల పంపిణీలో జాప్యం. ఆర్భాటపు ప్రకటనలు.. అరకొర ఆచరణ. తూతూ మంత్రం నివేదికలతో సరి. సిబ్బంది కొరతతో ముందుకు సాగని మట్టి పరీక్షలు. అయోమయంలో రైతాంగం విశాలాంధ్ర-సచివాలయం:రాష్ట్రంలో ‘ఖరీఫ’ ముంచుకొస్తున్న తరుణంలో అన్నదాతలకు దిక్సూచిగా మారాల్సిన భూసార పరీక్షల ప్రక్రియ కేవలం ప్రభుత్వ కాగితాలకే పరిమితమవుతోందనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రసాయన ఎరువుల అడ్డగోలు వాడకాన్ని అరికట్టి, నేలతల్లికి పూర్వవైభవం తీసుకువస్తామని, పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభసాటి వ్యవసాయాన్ని అందిస్తామని పాలకులు…

Read More

విశాఖ స్టీల్ ప్లాంట్‌లోఘోర ప్రమాదం – Visalaandhra

. 8 మంది మృతి… ఆరుగురి పరిస్థితి విషమం. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్ప్పున పరిహారం : ఏఐటీయÖసీ డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు స్టీల్ ప్లాంట్ ఎసఎంఎస్-2 లో ల్యాడిల్ పేలి ద్రవ ఉక్కు పడిపోవడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా…

Read More

కలిసి నడుద్దాం

ప్రజాసమస్యలే అజెండాగా మోదీ సర్కారుపై పోరాటం . తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆర్థిక, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై అఖిలపక్ష సమావేశం. ఇండియా ఐక్య సంఘటన డిమాండ్. ఎసఐఆర్ లోపాలు.. ‘ఓట్ల దోపిడీ’పై సీజేఐకి లేఖ. పార్లమెంట్‌లో ఐక్యగళం. ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం. దిల్లీ ‘ఇండియా’ భేటీలో కీలక నిర్ణయాలు. 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు న్యూదిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ అందరం కలిసి అడుగులు వేయాలని ఇండియా…

Read More

టీఎంసీలో ముదిరిన సంక్షోభం

. మమతకు 20 మంది ఎంపీల ఝలక్. ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్‌కు లేఖ. బెనర్జీ ‘ఇండియా’ భేటీలో ఉండగానే కీలక పరిణామం న్యూదిల్లీ: తృణమÖల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని చుట్టుముట్టిన సంక్షోభం సోమవారం మరింత ముదిరింది. పార్టీ చీఫ్‌విప్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు సోమవారం లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఈ పరిణామం…

Read More

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం – Visalaandhra

. కుప్పకూలిన భవనాలు. 32 మంది మృతి… వందలాది మందికి గాయాలు మనీలా: ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సోమవారం ఉదయం మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్టు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. అనంతరం తీవ్రతను 7.8గా సవరించారు. భూకంపం కారణంగా 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… వందలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇది భూమికి…

Read More

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం

. ఇరాన్`ఇజ్రాయిల్ మధ్య భీకర దాడులు. శాంతి ప్రయత్నాలకు విఘాతం. ట్రంప్ సూచన పట్టించుకోని నెతన్యాహు తెహ్రాన్/టెలఅవివ్: యుద్ధం ముగిసిందనుకున్న వేళ మళ్లీ మంటలు ఎగిసిపడ్డాయి. నిశ్శబ్దం వచ్చిందనుకున్న వేళ మళ్లీ సైరన్లు మోగాయి. సరిహద్దులు సద్దుమణిగాయనుకున్న వేళ మళ్లీ క్షిపణులు గాల్లోకి ఎగిరాయి. పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఏప్రిల్‌లో కాల్పుల విరమణతో కొంత శాంతి నెలకొన్నట్టు కనిపించినా… తాజాగా ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒక్క ఇజ్రాయిల్, ఇరాన్ మాత్రమే…

Read More