స్వచ్ఛపథం కార్యక్రమంలో నార్పలలో రహదారి శుభ్రత పనులు….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా స్థానిక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. నార్పల నుంచి కేశేపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో, స్మశాన వాటిక ప్రాంతం సమీపంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. రహదారి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, గడ్డి, మట్టి దిబ్బలను తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం కూతలేరు వంకపై ఉన్న చిన్న…


