మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల సిలిండర్పై రూ.42 భారం
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.42మేర పెంచినట్లు తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. కోల్కతాలో ఈపెంపు మరింత ఎక్కువగా ఉండి రూ.53.50గా నమోదైంది.అలాగే ఐదుకిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.11చొప్పున పెంచారు.అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.దేశంలో ఎల్పీజీ రిటైల్ ధరలను సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్…


