మే 6వ తేదీ ఉదయం రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 6 నుండి 7వ తేదీ వరకు వర్షాల విస్తృతి పెరిగి హైదరాబాద్, మేడ్చల్, సిద్ధిపేట, జనగాం, వరంగల్ వంటి జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.



