ప్రత్యేకంగా శనివారం, ఆదివారం వంటి సెలవు రోజుల్లో అయితే అక్కడ పరిస్థితి మరింత రద్దీగా మారుతుంది. దోశ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి రావడంతో కొందరు ఇడ్లీ, బోండా, వడ, పూరి వంటి టిఫిన్లతో సరిపెట్టుకుని వెళ్తుంటారు. కానీ అసలు ఉల్లిరవ్వ దోశ రుచి చూసినవారు మాత్రం మళ్లీ మళ్లీ అక్కడికే వస్తారని స్థానికులు చెబుతున్నారు. కాకినాడ-అనకాపల్లి సరిహద్దులోని తాండవ నది బ్రిడ్జి పక్కన రాత్రి వేళల్లో కనిపించే ఈ టిఫిన్ సందడి ఇప్పుడు ఫుడ్ లవర్స్కు ప్రత్యేక స్పాట్గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ ఉల్లిరవ్వ దోశ గురించి వీడియోలు వైరల్ అవుతుండగా.. ఒకసారి అయినా అక్కడికి వెళ్లి రుచి చూడాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు.



