నాల్గవ జోన్ కలయికతో పరిధి పెంచుకున్న కాకినాడ ఎపిఐఐసి ప్రాంతీయ కేంద్రం

— ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని విశాలాంధ్ర – కడియం : పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కాకినాడ ఏపీఐఐసీసీ ప్రాంతీయ కార్యాలయం నాలుగవ జోన్ కలయికతో మరింత పరిధి పెంచుకుంటుందని ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం కాకినాడ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కూడా కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో కలవడంతో పరిధి విస్తరించిందని పేర్కొన్నారు. అన్ని వనరులు…

Read More

ప్రశంసా పత్రాల బహుకరణ… ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మవరం అధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల కు చెందిన అధ్యాపకులు శ్రీ బాలాజోషి, శ్రీ కిరణ్ కుమార్ శ్రీ చక్రపాణి రెడ్డి, డా. మల్లికార్జున, కళ్యాణి , అనూష 2026 వ సంవత్సరం నుండి అమలు లో వచ్చే పాలిటెక్నిక్ సిలబస్ సీ-26 తయారీ లో ముఖ్యభూమిక పోషించారు అని తెలిపారు. ఈ సందర్భంగా వారి కృషి కి…

Read More

టమోటా సీజన్ ముందే కష్టాలు..రైతులపై యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన మల్చింగ్ పేపర్ ధరలు..! Gulf war impact mulching paper. |

వ్యవసాయ రంగంలో మల్చింగ్ పేపర్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి, కలుపు నివారణ, సమయం ఆదా, కూలీల ఖర్చు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు మాత్రమే మల్చింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా మంచి దిగుబడుల కోసం మల్చింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్లాస్టిక్ ధరలపై…

Read More

Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |

ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

ఖరీఫ్ ముంగిట అన్నదాతకు సంకటం

. 25 లక్షల భూసార కార్డుల పంపిణీలో జాప్యం. ఆర్భాటపు ప్రకటనలు.. అరకొర ఆచరణ. తూతూ మంత్రం నివేదికలతో సరి. సిబ్బంది కొరతతో ముందుకు సాగని మట్టి పరీక్షలు. అయోమయంలో రైతాంగం విశాలాంధ్ర-సచివాలయం:రాష్ట్రంలో ‘ఖరీఫ’ ముంచుకొస్తున్న తరుణంలో అన్నదాతలకు దిక్సూచిగా మారాల్సిన భూసార పరీక్షల ప్రక్రియ కేవలం ప్రభుత్వ కాగితాలకే పరిమితమవుతోందనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రసాయన ఎరువుల అడ్డగోలు వాడకాన్ని అరికట్టి, నేలతల్లికి పూర్వవైభవం తీసుకువస్తామని, పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభసాటి వ్యవసాయాన్ని అందిస్తామని పాలకులు…

Read More

News Updates Today: బిగ్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా |

News Updates Today: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈరోజు చర్చలు వాడీవేడిగా సాగాయి. మహిళలకు ప్రసూతి సెలవులు:  పిల్లలను దత్తత తీసుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అనుబంధం కూడా ముఖ్యమని తెలిపింది. దత్తత తీసుకున్న బిడ్డకు, కన్న బిడ్డకు మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో మూడు నెలల కంటే ఎక్కువ…

Read More

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా…

Read More

Life Hack: ఎండలకు పాలు పాడవుతున్నాయా? ఈ పౌడర్ చిటికెడు వేస్తే.. 2 రోజులు విరిగిపోయే ఛాన్సే లేదు..!

ఎండలో పాలు త్వరగా పాడవకుండా చెఫ్ కలగాటి డేవిడ్ కుమార్ చిట్కాలు చెప్పారు, బేకింగ్ సోడా చిటికెడు, చల్లటి గిన్నె, యాలకులు, ప్రతి 8 గంటలకు మళ్లీ మరిగించడం, చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచించారు. Source link

Read More

ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ గురువారం విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 59శాతం మంది, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విజయం సాధించిన, మార్కులు మెరుగుపరుచుకున్న విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ సదుపాయం కల్పించారు. Source link

Read More