శరీర అంతర్గత ఉష్ణోగ్రత గనుక 40°C మార్కును దాటితే, అది భయంకర పరిస్థితికి దారితీస్తుంది. ఈ దశలో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు వంద శాతం ఉంటాయి. అప్పుడు మన శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ పూర్తిగా విఫలమై, మెదడులో గందరగోళం, తీవ్రమైన బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే స్పృహ కోల్పోవడమే కాకుండా, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



