Last Updated:
Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రెండు కార్యక్రమాలు పెట్టుకున్నారు. వాటిలో ఒకటి కుప్పంలో ఉండగా.. మరొకటి బెంగళూరులో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ వార్షిక జాతర ఉత్సవాలలో పాల్గొనేందుకు కుప్పంకి వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు శాంతిపురం మండలం తుమ్సికి.. హెలికాప్టర్లో చేరుకుంటారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారని ది హిందూ రిపోర్ట్ చేసింది.
ఆ తర్వాత చంద్రబాబు.. కడపల్లె గ్రామంలోని తన ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం కుప్పం మున్సిపాలిటీలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి, జాతర ఉత్సవాలలో పాల్గొంటారు. మే 18న మొదలైన జాతర నేటితో ముగుస్తుంది.
ఈ పర్యటన సొంత నియోజకవర్గం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చూపిస్తోంది. గతంలో కూడా ఆయన గంగమ్మ జాతరలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
బెంగళూరు ప్రయాణం: కుప్పం పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు టుమ్సి హెలిపాడ్ నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరతారు చంద్రబాబు. సాయంత్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై దృష్టి సారిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ని గతంలో ప్రధాని మోదీ వంటి నాయకులు కూడా సందర్శించారు.
చిత్తూరు పర్యటన:
సీఎం చంద్రబాబు మే 23న చిత్తూరు సమీపంలోని యాదమారిలో పర్యటిస్తారు. యాదమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘సంజీవని’ ప్రాజెక్టును ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



