నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్న్యూస్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రానున్నాయని ఐఎండీ పేర్కొనడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ప్రతి సంవత్సరం…


