తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. తొలి దశలో గతేడాది బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ సహా 11 రాష్ట్రాల్లో ఈ సవరణలు చేపట్టగా, ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి.మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100…

Read More

ప్లాన్ బీ లేదు..

ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలుప‌శ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల…

Read More

13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…

మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి…

Read More

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు…

Read More

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్…

Read More

నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం

విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Source link

Read More

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

కరెస్పాండెంట్ నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ నిర్మలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ తరగతి నుండి ప్రైమరీ తరగతుల వరకు నిర్వహించామని తెలిపారు. తదుపరి ఫ్రీ ప్రైమరీ తరగతులలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రసంగాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శెట్టిపి సూర్య…

Read More

ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా…

Read More

చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు – Visalaandhra

దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్…

Read More

కదం తొక్కిన ఎర్రసైన్యం

.. అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ, బీకేఎంయూ పాదయాత్ర​ .. అడుగడుగునా నీరాజనాలుమహిళల హారతులు, ఆకట్టుకున్న. కళాకారుల నృత్యాలు​ ఉపాధి హామీని కాపాడాలి.. వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి: నేతల డిమాండ్ ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదల కష్టార్జితానికి భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని…

Read More