కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ: ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కే .ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని, అందుకు అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణలో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ , ఎమ్మెస్ ఆఫీస్ టూల్స్ కోర్సులు బోధించబడతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు…


