Sarathkumar & Varalaxmi at Tirumala: తిరుమల శ్రీవారి చెంత శరత్కుమార్, వరలక్ష్మి..



ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్. శరత్కుమార్ మరియు ఆయన కుమార్తె వరలక్ష్మి శరత్కుమార్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వీరికి, రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల శరత్కుమార్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. వరలక్ష్మి శరత్కుమార్ కూడా స్వామివారి పట్ల తన భక్తిని చాటుకున్నారు. వీరిని చూసేందుకు భక్తులు మరియు అభిమానులు ఎగబడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *