సీఎం చంద్రబాబు జిల్లాల బాట.. నేటి నుంచి ఐదు రోజుల పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఆయన నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన తిరుపతి…


