సైద్ధాంతిక పదునుతో పోరాటాలకు సన్నద్ధం – Visalaandhra
దోనేపూడి శంకర్ భారత కమ్యూనిష్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్టు సమితి నిర్వాహణలో పెనుగంచిప్రోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజకీయ-సైద్ధాంతిక శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఉద్యమ చరిత్రలో ఈ శిక్షణ శిబిరం ఒక విశిష్ట ఘట్టంగా, పార్టీ నిర్మాణం, ఉద్యమ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. పార్టీ భావజాలంపై అవగాహనను విస్తృతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటాలకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, మతోన్మాద-ప్రతిఘాత శక్తుల దాడులను తిప్పికొట్టేందుకు ప్రజలను…


