డిగ్రీ తెలుగు పాఠ్యాంశంలో రవీంద్రనాథ్ రచించిన ‘హా…హతవిధీ”కవిత చేర్పు
విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన “హా… హతవిధి” అనేకవితను డిగ్రీ మూడవ సెమిస్టర్ లో బోధన నిమిత్తంఎంపికచేస్తూ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది.సంపాదకులు సుంకర గోపాలయ్య కవి పక్కి రవీంద్రనాథ్ అనుమతిని కోరుతూ లేఖను పంపించారు. డిగ్రీ మూడవ సెమిస్టరులో కవిత్వ నిర్మాణమునకు సంబంధించిన పాఠంలో రవీంద్రనాథ్ కవితను చేర్చుతున్నట్టు లేఖలో ఆయన తెలిపారు.రవీంద్రనాథ్ రచించిన నొయిడా నిఠారి కాల్వలో …అనుకవిత హిందీ అనువాదాన్ని గతంలో పుదుచ్చేరి ప్రభుత్వం డిగ్రీ…


