Andhra Weather Alert: ఏపీలో 5 రోజులు వర్షాలు.. కోస్తాంధ్రకు వెదర్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 44.6 మి.మీ, అమలాపురంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలులో 41.1°C గరిష్ట ఉష్ణోగ్రత…


