మాజీ గూఢచారి అధికారి ఇంట్లో 300 కిలోల బంగారం.. సీఐఏనే దోచిన ఘనుడు
అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నిఘా సమాచార సేకరణలో పేరొందిన ఈ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారం,నగదు బయటపడటంతో అధికారులు విస్తుపోయారు.దర్యాప్తులో భాగంగా అతని నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఎఫ్బీఐ అధికారులు ఒక్కోటి కిలో బరువున్న 300 బంగారు బిస్కెట్లను గుర్తించారు. వీటితో పాటు 35 ఖరీదైన విలాసవంతమైన గడియారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం…


