మాజీ గూఢచారి అధికారి ఇంట్లో 300 కిలోల బంగారం.. సీఐఏనే దోచిన ఘనుడు

అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నిఘా సమాచార సేకరణలో పేరొందిన ఈ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారం,నగదు బయటపడటంతో అధికారులు విస్తుపోయారు.దర్యాప్తులో భాగంగా అతని నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌బీఐ అధికారులు ఒక్కోటి కిలో బరువున్న 300 బంగారు బిస్కెట్లను గుర్తించారు. వీటితో పాటు 35 ఖరీదైన విలాసవంతమైన గడియారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం…

Read More

రిజర్వ్ చేసిన తీర్పులు మూడు నెలల్లోనే తీర్పులివ్వండి..

హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలురాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడునెలల్లోపు ప్రకటించాలని స్పష్టం చేసింది. తీర్పుల విడుదలలో ఆలస్యం కారణంగా న్యాయప్రక్రియపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపిన్ పంచోలి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ ఆదేశాలు వెలువరించింది.వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో మూడు…

Read More

ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, భారత్ అండగా ఉంది..: నెతన్యాహు

ఇండియ‌న్స్‌కు మాపై పిచ్చి అభిమానం అన్న ఇజ్రాయెల్ ప్రధాని ప్రపంచంలో ఏ దేశం నుంచీ లేనంతగా, భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని వ్యాఖ్యగతంలో తన భారత పర్యటనను లవ్ ఫెస్ట్గా అభివర్ణించిన నెతన్యాహు యూఎస్‌లో తన ప్రతిష్ఠ‌ను దెబ్బతీసేందుకు పాక్‌ సోషల్ మీడియా బాట్ ఫామ్స్‌ను వాడుతోందని ఆరోపణ‌ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి భారత్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ దేశం ప్రతిష్ఠ‌ను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని,…

Read More

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్

తెహ్రాన్: ఒక వైపు ఆదిపత్యం…మరో వైపు ఆత్మ గౌరవం. ఈ రెండు కారణాలతోనే అమెరికా`ఇరాన్ మధ్య ఘర్షణలు తలెత్తాయి. చిన్నోడికి చిన్న దెబ్బ…పెద్దోడికి పెద్ద దెబ్బ అన్నట్టుంది ఈ రెండు దేశాల యుద్ధ ప్రభావం. మేమెక్కడా తగ్గం అని ఇరాన్ ప్రతి దాడులతో నిలబడుతోంది. అమెరికా ఆధిపత్యానికి చిక్కకుండా పోరాటం సాగిస్తోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నా…ఇరాన్ ఒంటరిగానే అమెరికాకు ముఖ్యంగా ట్రంప్‌కు చెమటలు పట్టిస్తోంది. అమెరికా ఒకవైపు చర్చలు…

Read More

పరిపాలన అధికారి ఆరోపణలపై విచారణ జరిపాం

కలెక్టర్ కు నివేదిస్తాం.. డి సి హెచ్ ఎస్ మధుసూదన్ విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పరిపాలన అధికారి పై వచ్చిన ఆరోపణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా తాను రావడం జరిగిందని డిసిహెచ్ఎస్ మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగించడం జరిగిందని తెలిపారు. అనంతరం డిసిహెచ్ఎస్ మధుసూదన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల…

Read More

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న మసీదుల ప్రాంగణంలో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (ఈద్-అజ్హా) పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగను పురస్కరించుకుని మండలంలోని ముస్లిం నివాసాలు, ప్రధాన మసీదుల ప్రాంగణాలు భక్తులతో మరియు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఈ సందర్భంగా మసీదుల ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనల సమావేశాలు ఏర్పాటు చేయగా, మసీదు ఆవరణలోని ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా స్థలంలో ముస్లిం పెద్దలు, యువకులు…

Read More

నార్పలలో ఘనంగా బక్రీద్ వేడుకలు – భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-అధా…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై ప్రత్యేక ఈద్ నమాజులు నిర్వహించారు.నమాజుల సందర్భంగా దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐకమత్యం మరియు సుఖసంతోషాలు నెలకొనాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. ప్రార్థనలు అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని…

Read More

ఉరవకొండలో ఘనంగా టీడీపీ మహానాడు కార్యక్రమం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండలో రెండవ రోజు గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని కార్యకర్తలు టీవీల ద్వారా వీక్షించారు….

Read More

నిరుపేదలకు గొడుగులు,పాదరక్షలు పంపిణీ

విశాలాంధ్ర – కడియం : సమాజంలో కష్టాలలో ఉన్నవారికి తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి అన్నారు. మండు వేసవిలో రోడ్లపై జీవనం సాగిస్తున్న నిరుపేదలు, నిరాశ్రయులు, యాచకుల కష్టాలను గుర్తించి చిరు సేవా సమితి తరపున పాదరక్షలు గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుంచి గోదావరి బండ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నివసిస్తున్న బాధితులకు పంపిణీ చేసినట్లు…

Read More

యాడికి లో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

విశాలాంధ్ర – యాడికి…యాడికి మండల కేంద్రంలోని వెంగమనాయుడు కాలనీలో దర్గా సమీపంలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టపై కూర్చుని ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని తెలిపారు. అతని చిరునామా లేదా కుటుంబ సభ్యుల సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం…

Read More