జీ7, బ్రిక్స్ మధ్య సమతుల్యతే సవాల్
డా॥ అరుణ్ మిత్ర ఇటీవల జరిగిన జీ7 సదస్సుకు సభ్యదేశాలతో పాటు భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఉక్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి దేశాలను కూడా ఆహ్వానించారు. ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించిన జీ7 దేశాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అయినప్పటికీ, వాటి విదేశాంగ విధానంలో సామ్రాజ్యవాద ధోరణి ఇంకా కొనసాగుతోందనే అభిప్రాయాలు…


