దారుణంగా మారిన ఓబగానపల్లి రహదారి-మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

విశాలాంధ్ర – కంబదూరు..కంబదూరు మండలంలోని ఓబగానపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయల ప్రజాధనంతో 12 కిలోమీటర్ల పొడవున తారురోడ్డు నిర్మించారు. అయితే గాలిమరల నిర్మాణ పనుల సమయంలో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం రహదారిపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిన పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా…

Read More

యాడికిలో బైక్ బోల్తా.. తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – యాడికి..యాడికి మండల శివారులోని గుత్తి రోడ్డులో జూనియర్ కళాశాల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల మేరకు, బైక్ అదుపు తప్పి బోల్తా పడటంతో కిష్టిపాడుకు చెందిన తండ్రీ కొడుకులు మురళీ మోహన్ రెడ్డి, నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.వీరు యాడికిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప…

Read More

మిట్స్‌సెట్–2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభం – Visalaandhra

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సం. నిర్వహించిన మిట్స్‌సెట్–2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 27న నుండి జూన్ 3వ వరకు నిర్వహించనున్నట్లు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్. డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. బీటెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల…

Read More

బక్రీద్ పర్వదినం వేళ… జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీసు బందోబస్తు

జిల్లా ఎస్పీ పి.జగదీష్ విశాలాంధ్ర (అనంతపురం టౌన్) : బక్రీద్ పండుగ పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మసీదులు, ప్రార్థనా స్థలాలు, ఆయా పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఆయా పరిసరాలలో సంచరించకుండా మరియు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బక్రీద్ సందర్భంగా ప్రజల రద్దీ…

Read More

సెంచరీలు మళ్లీ వస్తాయి.. ట్రోఫీయే ముఖ్యం..: వైభవ్‌

తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న వైభవ్‌ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇన్నింగ్స్‌తో వేగవంతమైన సెంచరీ సాధించే అవకాశానికి దగ్గరగా వెళ్లినా, అది కాస్త తృటిలో చేజారిపోయింది. అయితే వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వైభవ్‌ స్పష్టం చేశాడు. ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలతో వచ్చినా, తనకు తనదైన ప్రణాళికలు…

Read More

ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబుఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్యతొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబుచరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చెప్పారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి, దేశానికి విశేష…

Read More

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

కేంద్రానికి కొలీజయం సిఫారసున్యూదిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో శుక్ర, బుధవారాల్లో సమావేశమైన కొలీజియం..,అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ఇందులో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, ఒకరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఆరు ఖాళీలున్నాయి. ఇప్ప్పుడున్న 32 మంది న్యాయమూర్తుల్లో జస్టిస్ బీవీ నాగరత్న మాత్రమే మహిళ. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కొలీజియం…

Read More

అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు

తెహ్రాన్: చర్చలు చర్చలే…యుద్ధం యుద్ధమే అన్నట్లుగా ఉంది అమెరకా`ఇనాన్ తీరు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే… అమెరికా- ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హోర్మూజ్ సమీపంలో అమెరికా దాడులకు దిగింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హోర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగిన కాసేపటికే బందర్ అబ్బాస్…

Read More

సీఎం పదవికి రాజీనామా

అల్పాహార విందులో సిద్ధరామయ్య వెల్లడిబెంగళూరు: కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నట్లుగానే నాయకత్వ మార్పు ఎట్టకేలకు ఖరారైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో గురువారం ఉదయం జరిగిన అల్పాహార విందులో సిద్ధూ తన నిర్ణయాన్ని క్యాబినెట్ మంత్రులకు వివరించారు. తదుపరి సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సిద్ధరామయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే… ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాత్…

Read More

ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయి

ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలపై .. మల్లికార్జున ఖర్గే చురకబీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గేఅధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మంచినీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస్తే నిర్లక్ష్యం వహించకూడదని జాగ్రత్తలు చెప్పారు. మోదీ జాగ్రత్తలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలరని, కానీ బీజేపీ ప్రాయోజిత…

Read More